ఎం. జె. ఎఫ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపెల్లి లక్ష్మణ్
రణం:: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్11,రాజీవ్ యువ వికాసం గడువును పొడిగించా లని ఎం జె ఎఫ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారా యణ, బెక్కెం అశోక్, లు కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “మీ సేవ” లలో దరఖాస్తు చేసు కునేవారికి కులం, ఆదాయం, సరైన సమయానికి అందక కపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొందరి వద్ద కులం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ ఈ సంవత్సరంకు సంబంధించి ఆదాయం సర్టిఫికెట్ లేకపోవడంతో సర్టిఫికెట్లు తీసేసరికి కొంత ఇబ్బందికి గురవు ఉన్నారని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా 5, లక్షల మందికి రూ 6, కోట్ల రుణాలను 60- 80%, వరకు రాయితీతో ఇవ్వనుంది. అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, ఇన్కమ్, సర్టిఫికెట్ ఆధార్, కుల, ధ్రువీకరణ పత్రం ఫోటో అవసరం ఉన్నదని ప్రభుత్వం పేర్కొంది.
