సోషల్ మీడియాలో వైరల్…
హృదయాన్ని కదిలించే సంఘటన.!
తన చావు కూడా సంతానానికి భారం కావద్దని

రణం న్యూస్ డెస్క్:జులై 4
నల్గొండ జిల్లాలో నార్కెట్ పల్లి మండలంలో మాండ్ర గ్రామంలో ఒక తల్లి చనిపాయింది.!తన చావు ఖర్చు కోసం తానే డబ్బులు దాచింది.!ఎప్పటినుంచో సంపాదించి దాచుకున్న డబ్బును తన దిండులో ఉన్నట్లు తన కొడుకుకు చూపుతూ కన్నుమూసింది.!చనిపోయిన తరువాత కూడా సంతానానికి భారం కాకూడదని కోరుకుందేమో ఈ తల్లీ లక్ష్మమ్మా.!ఆ తల్లికి నోట్లు రద్దు అయినట్లు తెలియకపోవడం బాధ కలిగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.!ఎంతైనా తల్లి ప్రేమ గొప్పదే…!