
రణం: న్యూస్ కోరుట్ల:మార్చి 27
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు, డా . రమణ, డాక్టర్ శ్రీనివాస్ లు గురు వారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ని సందర్శించారు.ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సునీత , సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగం గూర్చి చర్చించడం జరిగింది. కేంద్రo లో జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయి లో ఎలా నడుస్తున్నాయని పరిశీలించారు. ఏరియా హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందిన వివిధ వ్యక్తులను కలిసి ఆరోగ్య సేవలు అందుచున్న విధానాన్ని వారితో ముఖాముఖి సంభాషణ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక వసతులు, లాబ్ సేవలు, గర్భిణి లకు, ప్రసవానంతరం తల్లు లకు అందించే సేవలు, పిల్లల వ్యాధినిరోధక టీకాలు, యుక్త వయస్సువారికి ఆరోగ్యము, ఫ్యూబార్టి సమయం లోవచ్చే మార్పులు, వారికి కౌన్సిలింగ్ చేయడం, అసంక్రమిక వ్యాధులకు, సంక్రమిక వ్యాధులకు అందించే సేవలను, మందుల నిలువలు,, నిధుల వినియోగం గురించి క్షున్నంగా సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఆరోగ్య సేవలపట్ల సంతృప్తి వ్యక్త పరిచారు. అనంతరం ఐ సి టి సి సెంటర్ మరియు టీబీ యూనిట్లను సందర్శించి ఆన్ హ్యాండ్ క్షయ వ్యాధిగ్రస్తుల కేసులు ఎన్ని ఉన్నాయి? వారందరికీ చికిత్స అందించే కార్డ్స్ ఉన్నాయా లేవా అని సరి చూశారు. నిక్షయ పోషణ యోజన కింద వారందరికీ డబ్బులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ నెలా ప్రిజంటివ్ టెస్టింగ్ ఎక్కువగా జరిగేలా చూడాలని తద్వారా ఏ ఒక్క టీబీ కేసు తప్పిపోకుండా చికిత్స అందించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ లక్ష్మి, ఈఎన్టి డాక్టర్ రమేష్ ,జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి తులసి రవీందర్, హెచ్ ఈ. తరాల శంకర్, సూపర్వైజర్ బి.మురళిధర్, సీనియర్ ఫార్మసిస్ట్ ఉదయ ప్రసాద్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.