విలాసాగర్ లో మున్నూరు కాపు సంఘ ఆషాడ మాస బోనాలు


బోయినపల్లి రూరల్ :జూలై20:రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో పుర వీధుల గుండా ఆషాడ మాస బోనాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. కొలిచే భక్తులకు కొంగుబంగారంగా నిలిచే పోచమ్మ తల్లికి ప్రధాన వీధుల గుండా సంఘ సభ్యుల ఇళ్ల నుండి మున్నూరు కాపు కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం మహిళలు నెత్తిన బోనాలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం నాయకులు, మహిళలు, భక్తులు భారీగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. “ఆషాడ బోనం అమ్మకు అత్యంత ప్రియం” కాగా విలాసాగర్ లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పోతురాజులు విన్యాసాలు, యువకుల చిందులు కళాకారులు వివిధ రూపాల్లో ప్రదర్శనలు గ్రామ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కాపు సంఘ సభ్యులు ఉత్సహంగా పాల్గొన్నారు

